Thursday, January 16, 2020

హిజ్బుల్ మొజాహిదీన్ కు చెందిన ఇద్దరు తీవ్రవాదులను రహస్యంగా ఢిల్లీకి తీసుకుపోతూ జమ్మూకాశ్మీర్ పోలీసు అధికారి దవీందర్ సింగ్ పట్టుబడ్డాడు. ఇదేదో మామూలు విషయం కాదు.
చాలా చాలా సీరియస్ విషయం.
CAA /NRC లకు వ్యతిరేకంగా అట్టుడుకుతున్న దేశాన్ని ,మతాలకు అతీతంగా ఏకమై ఫాసిస్టులకు చెమటలు పట్టిస్తున్న ఈ దేశ ప్రజలను పక్కదారి పట్టించే ఘోరపథకమేదో రచించ బడుతోంది. 
గతంలోకూడా వాజపేయి ప్రభుత్వ హయాంలోపార్లమెంట్ పై తీవ్రవాదుల దాడి జరిగినప్పుడు కూడా ఇదే దవీందర్ సింగ్ ద్వారానే 
ఆ సోకాల్డ్ తీవ్రవాదులు ఢిల్లీలోకి ప్రవేశించారు. 
వారికి ఢిల్లీలో కిరాయికి ఇల్లు చూపించేలా 
అఫ్జల్ గురును వత్తిడి చేసిందీ ఆతరువాత అఫ్జల్ గురును కూడా ఆ తీవ్రవాదుల బృందంలో ఒకడిగా నేరారోపణ చేసి ఉరితీయడం వెనుక ఉన్నది కూడా ఈ దవీందర్ సింగే. ఒక చిన్నపోలీస్ ఆఫీసర్ స్వతంత్రంగా ఈ పనులన్నీ చేయలేడు.
దవీందర్ సింగ్ ఒక చిన్నపావు మాత్రమే. 
దేశం మూడ్ ను తిరిగి ఉన్మాద దేశభక్తివైపు,
విద్వేషపూరిత మతోన్మాదం వైపూ ,విభజన వైపూ మళ్ళించడానికి చాలా ఉన్నత స్థాయి అధికారులు  వేస్తున్న హంతక పథకమేదో ఉంది. 
అది త్వరలోనే బయటకి రాక తప్పదు.
ప్రజలు తమ ఐక్యతను కాపాడుకోవాల్సిన సమయం ఇది.

No comments: